www.ntodaynews.com
తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..!
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రేమజంట పెళ్లి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడి రూ.70 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
ప్రేమజంట ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో ఉచ్చుపన్ని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.