www.ntodaynews.com
దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..!
తెలంగాణ
దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..!
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. రూ.10 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంబాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భూమి సంబంధిత పని పూర్తి చేయాలంటే లంచం తప్పదంటూ బాధితుడిని వేధించినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు కార్యాలయంలోనే ఉచ్చుపన్ని రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ దాడులతో తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు కీలక పత్రాలను పరిశీలిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.