www.ntodaynews.com
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..!
ఆంధ్రప్రదేశ్
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల సమస్యల పరిష్కారానికి 6 నెలల్లో స్పష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితుల డిపాజిట్లు, ఆస్తుల విక్రయం, చెల్లింపుల ప్రక్రియపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.
ఏపీలోనే 11.5 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, మరో 8 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది ఈ సంస్థ వల్ల నష్టపోయారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.