BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం

తెలంగాణ
/ మేడక్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:34 PM
83 వీక్షణలు

కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం 

పేదరికం, పోషించే స్తోమత లేక ఓ దంపతులు తమ నవజాత ఆడశిశువును రూ.3 లక్షలకు అమ్మేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో మెదక్ మాతా శిశు కేంద్రంలో శిరీష మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో శిశువును పోషించలేమని భావించిన దంపతులు బిడ్డను విక్రయించాలని నిర్ణయించారు.

మధ్యవర్తుల సహాయంతో సిద్ధిపేట జిల్లా అల్లీనగర్‌కు చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు రూ.3 లక్షలకు శిశువును అప్పగించారు.

అయితే ప్రసవం తర్వాత తల్లి వద్ద బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. తాండాలో విచారణ చేపట్టిన అధికారులు శిశు విక్రయం జరిగినట్టు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువు తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.

 డబ్బు కోసం పసిబిడ్డల భవిష్యత్తును అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.