BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం

తెలంగాణ
/ మేడక్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:34 PM
130 వీక్షణలు

కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం 

పేదరికం, పోషించే స్తోమత లేక ఓ దంపతులు తమ నవజాత ఆడశిశువును రూ.3 లక్షలకు అమ్మేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో మెదక్ మాతా శిశు కేంద్రంలో శిరీష మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో శిశువును పోషించలేమని భావించిన దంపతులు బిడ్డను విక్రయించాలని నిర్ణయించారు.

మధ్యవర్తుల సహాయంతో సిద్ధిపేట జిల్లా అల్లీనగర్‌కు చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు రూ.3 లక్షలకు శిశువును అప్పగించారు.

అయితే ప్రసవం తర్వాత తల్లి వద్ద బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. తాండాలో విచారణ చేపట్టిన అధికారులు శిశు విక్రయం జరిగినట్టు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శిశువు తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.

 డబ్బు కోసం పసిబిడ్డల భవిష్యత్తును అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.