BREAKING
Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం.
www.ntodaynews.com

బావిలో పడిన భారీ మొసలి.. పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
18 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ మొసలి కలకలం సృష్టించింది. మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వాసం వీరస్వామి వ్యవసాయ బావిలో ఒక భారీ మొసలి ప్రత్యక్షమైంది. బావిలో మొసలిని గమనించిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొసలిని చూసేందుకు తరలివచ్చారు. ఈ ఘటనతో మొండ్రాయిగూడెం, సమీపంలోని ఎంచగూడెం గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా రైతులు, గొర్ల కాపరులు, చిన్నారులు పొలాలు, చెరువులు, బావుల పరిసర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మొసలి బావిలో ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, దానిని సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

గ్రామాల్లో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు అవసరం లేకుండా బావుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.