BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

బావిలో పడిన భారీ మొసలి.. పొలాలకు వెళ్లొద్దని హెచ్చరికలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
71 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీ మొసలి కలకలం సృష్టించింది. మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వాసం వీరస్వామి వ్యవసాయ బావిలో ఒక భారీ మొసలి ప్రత్యక్షమైంది. బావిలో మొసలిని గమనించిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొసలిని చూసేందుకు తరలివచ్చారు. ఈ ఘటనతో మొండ్రాయిగూడెం, సమీపంలోని ఎంచగూడెం గ్రామ ప్రజలు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా రైతులు, గొర్ల కాపరులు, చిన్నారులు పొలాలు, చెరువులు, బావుల పరిసర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మొసలి బావిలో ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, దానిని సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

గ్రామాల్లో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు అవసరం లేకుండా బావుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.