BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

పదవ తరగతి టాపర్లకు లయన్స్ క్లబ్ నగదు పురస్కారాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Jun, 2026 - 03:43 PM
9 వీక్షణలు

ఎస్‌ఎస్‌సీ–2026 ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించి, నగదు పురస్కారాలను అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

​చిట్యాలలోని గ్రీన్ గ్రోవ్ హై స్కూల్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో చిట్యాల మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన బాలగోని అక్షర్, ద్వితీయ స్థానం సాధించిన పందిరి సహస్రలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, నగదు పురస్కారాలను అందజేశారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని క్లబ్ సభ్యులు కొనియాడారు.

​అనంతరం చిన్న కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన విద్యార్థిని హెచ్చు శ్రీవిద్యను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ క్లబ్ తరఫున ఉన్నత విద్యకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్, కోశాధికారి కొల్లోజు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు పాటి మాధవ రెడ్డి, జీఎంటీ కోఆర్డినేటర్ తేరేటుపల్లి హనుమంతు, వరకాంతం భాస్కర్ రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, గంజి వెంకటేశం, జెల్ల రమేష్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, రవీంద్రచారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.