షాద్నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..!
షాద్నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..!
ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ మూడు నెలలపాటు నరకయాతన అనుభవించిన ఘటన షాద్నగర్లో వెలుగుచూసింది. కాన్పు అనంతరం శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన సర్జికల్ ప్యాడ్ను గర్భసంచిలోనే వదిలేయడంతో బాధితురాలు తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లింది.
మూడు నెలలుగా అసహనీయ నొప్పులతో బాధపడుతున్న మహిళను మరో మహిళా డాక్టర్ పరీక్షించగా అసలు విషయం బయటపడింది. వెంటనే చికిత్స చేసి గర్భసంచిలో ఉన్న సర్జికల్ ప్యాడ్ను తొలగించారు.
ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వాహణాధికారికి అధికారిక ఫిర్యాదు అందజేశారు.