BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:26 PM
119 వీక్షణలు

సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు

గ్యాస్ ఫికేషన్‌కు కేంద్ర ప్రోత్సాహం.. సింగరేణికి కొత్త అవకాశాలు

కొత్త ప్రాజెక్టులతో ఉపాధి, ఆదాయ వృద్ధిపై ప్రభుత్వ దృష్టి

సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విస్తృత ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తోంది. బొగ్గు నిల్వలు తగ్గిపోతూ మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులను ప్రారంభించేందుకు వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పర్యవేక్షణలో సింగరేణి సంస్థ 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశీయ వనరులను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో గ్యాస్ ఫికేషన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా బొగ్గు గ్యాస్ ఫికేషన్ ప్రాజెక్టుల అమలుకు సిద్ధమవుతోంది.

వాస్తవానికి దశాబ్దం క్రితమే సింగరేణి ఈ ప్రక్రియపై ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ అవి ముందుకు సాగలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త గనుల అభివృద్ధితో పాటు గ్యాస్ ఫికేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా విద్యుత్, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త అవకాశాలకు కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.