తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. నైరుతి రుతుపవనాలు బలపడటంతో ఆగస్టు 23 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.