BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

తిరువూరులో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:04 PM
48 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు:

తిరువూరు తోటమూల రింగ్ సెంటర్‌లో విలువైన ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. సుమారు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను జీవో నెంబర్ 30ను అడ్డం పెట్టుకుని అక్రమంగా క్రమబద్ధీకరించారని ఆయన విమర్శించారు.

నూజివీడు-మధిర ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తోటమూల ప్రాంతంలోని భూములు తిరువూరు నియోజకవర్గంలోనే అత్యంత విలువైనవిగా ఉన్నాయని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ.5,800 వరకు ఉండగా, కేవలం రూ.1,600కే ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపించారు.

సర్వే నెంబర్లు 62/1, 62/3, 62/4లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని స్వామిదాస్ పేర్కొన్నారు. 62/1లో 0.10 సెంట్లు, 62/3లో 0.75 సెంట్లు, 62/4లో 0.90 సెంట్ల చొప్పున భూములు అక్రమంగా నమోదు చేసినట్లు తెలిపారు.

జూన్ 9, 2026న తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించారు. తాజా రిజిస్ట్రేషన్లు రెండు నెలల క్రితం జరిగినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు.

జీవోలోని క్లాజు 4/8 ప్రకారం అత్యంత విలువైన వాణిజ్య భూములను క్రమబద్ధీకరించకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. అప్రూవల్ కమిటీ, కమిటీ కన్వీనర్‌గా ఉన్న తహసీల్దార్, సభ్యుడిగా ఉన్న ఎంపీడీఓ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రూ.50 కోట్ల విలువైన కమర్షియల్ భూమిని జిల్లా కలెక్టర్ అనుమతితో ఎలా క్రమబద్ధీకరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని స్వామిదాస్ ప్రశ్నించారు. వీఆర్వో, ఎమ్మార్వోలపై విచారణ జరిపి, కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.

అక్రమ రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, పూర్తి ఆధారాలతో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్వామిదాస్ తెలిపారు. భూముల అక్రమాల వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరించారు.