తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
పాలకుర్తి నియోజకవర్గం
తొర్రూరు పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో డా. కూరపాటి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ప్రజా ఆరోగ్యం – పరిరక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర”పై నిర్వహించిన అవగాహన మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు..
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు..