BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:30 PM
95 వీక్షణలు

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలోని తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన నలుగురు మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతానికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం శుక్రవారం ఉదయం వారు అందరూ కలిసి నదిలో స్నానానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఈత రాని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.