BREAKING
Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
www.ntodaynews.com

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:30 PM
144 వీక్షణలు

తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలోని తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన నలుగురు మృతి చెందారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతానికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం శుక్రవారం ఉదయం వారు అందరూ కలిసి నదిలో స్నానానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఈత రాని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.