వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి
టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి
నల్లగొండలో సభ్యత్వ నమోదు పుస్తకాలు ఆవిష్కరణ
NTODAY NEWS నల్గొండ
నల్గొండ జిల్లా వ్యాప్తంగా టి యూడబ్ల్యూజే( ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారం రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో సంఘం జిల్లా కార్యాలయం లో సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీని మరింత బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. ఒక్కో సభ్యత్వానికి కేవలం రూ.200 ( రెండు వందల రూపాయలు )చెల్లించి సభ్యత్వ నమోదు చేయించుకోవాలని జర్నలిస్టుల కోరారు. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడి టేషన్ లు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు , హెల్త్ కార్డులు అందేలా టి యు డబ్ల్యూ జె జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సభ్యత్వ నమోదు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో చిట్యాల, నల్లగొండ, తిప్పర్తి మాడుగుల పల్లి, మునుగోడు మండలాలకు చెందిన వివిధ పత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, సంఘం బాధ్యులు పాల్గొన్నారు