BREAKING
అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి కౌన్సిలర్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ స్త్రీ నిధిలో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు తెలంగాణ భాగస్వామ్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ఖరారు! ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: మహిళా సంఘాల భారీ నిరసన జోసెఫ్ విజయ్ అను నేను... అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి కౌన్సిలర్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ స్త్రీ నిధిలో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు తెలంగాణ భాగస్వామ్యం.. కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ఖరారు! ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: మహిళా సంఘాల భారీ నిరసన జోసెఫ్ విజయ్ అను నేను...
www.ntodaynews.com

వారం రోజుల్లోగా సభ్యత్వ నమోదు పూర్తి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
10 May, 2026 - 08:39 PM
37 వీక్షణలు

టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి

నల్లగొండలో సభ్యత్వ నమోదు  పుస్తకాలు ఆవిష్కరణ 

NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లా వ్యాప్తంగా టి యూడబ్ల్యూజే( ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారం రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో  సంఘం జిల్లా కార్యాలయం లో సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి  మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న  టీయూడబ్ల్యూజే  జిల్లా కమిటీని మరింత బలోపేతం చేయడం కోసం  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. ఒక్కో సభ్యత్వానికి కేవలం రూ.200 ( రెండు వందల రూపాయలు )చెల్లించి సభ్యత్వ నమోదు చేయించుకోవాలని జర్నలిస్టుల కోరారు. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడి టేషన్ లు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు , హెల్త్ కార్డులు అందేలా టి యు డబ్ల్యూ జె  జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు  అధికారులు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సభ్యత్వ నమోదు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో చిట్యాల, నల్లగొండ, తిప్పర్తి మాడుగుల పల్లి, మునుగోడు మండలాలకు చెందిన వివిధ పత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, సంఘం బాధ్యులు  పాల్గొన్నారు