BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

వేల్పుచర్లలో బెల్ట్ షాపు తొలగించాలని గ్రామస్తులు, మహిళల డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 11:32 PM
9 వీక్షణలు

వేల్పుచర్లలో బెల్ట్ షాపు తొలగించాలని గ్రామస్తులు, మహిళల డిమాండ్

ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, వేల్పుచర్ల, జూలై 25:

వేల్పుచర్ల గ్రామంలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ప్రాంతంలో కొల్లిపర్ర కుమార్ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్న బెల్ట్ షాపును వెంటనే తొలగించాలని గ్రామ మహిళలు, స్థానికులు శనివారం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మహిళలు, గ్రామస్తులు కుమార్ ఇంటి వద్దకు వెళ్లి, నివాస ప్రాంతంలో మద్యం విక్రయాలు చేయవద్దని, అవసరమైతే మరోచోట వ్యాపారం నిర్వహించుకోవాలని కుమార్ తండ్రికి విజ్ఞప్తి చేశారు.

మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వ్యక్తులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, దీంతో రోడ్డుపై నడిచే మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా బెల్ట్ షాపు సమీపంలో ఆంజనేయస్వామి మండపం ఉండటంతో భక్తులు, స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే బెల్ట్ షాపును తొలగించి చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కొల్లిపర్ర కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.