www.ntodaynews.com
విద్యుత్ షాక్తో లారీ డ్రైవర్ మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: తిరువూరు మండలం మునకుళ్ల గ్రామంలో శనివారం జరిగిన విషాద ఘటనలో లారీ డ్రైవర్ మేకల కిరణ్ (32) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం, లారీలోని మట్టి లోడును డంప్ చేసే సమయంలో ట్రిప్పర్ హైడ్రాలిక్ పైకెగసి 11 కేవీ విద్యుత్ వైర్లను తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించింది. దీంతో కిరణ్ తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడు తెలంగాణ రాష్ట్రం, కల్లూరు మండలం, చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్గా గుర్తించారు.
పంచనామా నిర్వహణ కోసం మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.