BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్రిక్తత.. సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ కార్మికుల యత్నం..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 02:08 PM
64 వీక్షణలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మున్సిపాలిటీల్లో ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కాస్ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేసి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కార్మికులను నెట్టే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి పిలుపుతో ధర్నా చౌక్ వద్ద భారీగా మున్సిపల్ కార్మికులు చేరుకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.