BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేటలో రాజకీయ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 12:06 PM
67 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో స్థాయిని మరిచి మాట్లాడటం తగదని హెచ్చరించారు.

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని తాము ప్రశ్నిస్తే, తమను, తమ అధినాయకులను నోటికి వచ్చినట్లు విమర్శించడం సరికాదన్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నల్లగట్ల స్వామిదాసుపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

గతంలో పోలీసుల కేసులో ఇబ్బందులు ఎదురైన సమయంలో ఎవరు సహాయం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. రౌడీషీట్ విషయంలో కూడా పోలీసులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసింది నల్లగట్ల స్వామిదాసు కాదా అని ప్రశ్నించారు.

పార్టీ మారిన వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు దేవుడిగా, మరో పార్టీలోకి వెళ్లిన తర్వాత దయ్యంగా కనిపించడం ఎక్కడి న్యాయమని నిలదీశారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తేలుతుందని, ప్రజల తీర్పే అంతిమమని పేర్కొన్నారు.