BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవలపై ఆరా తీసిన చైర్‌పర్సన్ నాగలక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
08 Jun, 2026 - 06:03 PM
96 వీక్షణలు

ధర్మపురి, జూన్ 8: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మున్సిపల్ చైర్‌పర్సన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ప్రయోగశాలల పనితీరు, వైద్యులు మరియు సిబ్బంది హాజరు వివరాలు, వైద్య పరికరాల వినియోగం, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన అన్ని సౌకర్యాలను ఆసుపత్రుల్లో కల్పించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి, అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషిని, చిపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, కొమురవెల్లి పవన్, జంజీరికాని సువర్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్.కె. షౌకత్, సుల్తానా, అశెట్టి మమత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.