మహిళ అదృశ్యం – ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి...
చిత్తూరు.
బంగారుపాళ్యం.
బంగారుపాళ్యం మండలం బేరిపల్లి గ్రామానికి చెందిన D. శ్యామల (52) అనే మహిళ అదృశ్యమైనట్లు బంగారుపాళ్యం పోలీసులు తెలిపారు. ఆమె భర్త పేరు జయచంద్ర.
2026 సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇంట్లో భర్తతో గొడవ అనంతరం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆమె గురించి తెలిసిన వారు, ఎక్కడైనా కనిపించిన వారు లేదా ఆమెకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
📞 బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్: 9440796736
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్
ప్రజలకు విజ్ఞప్తి: ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి.