BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

యువత భవితకు మత్తు ముప్పు వద్దు.. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Aug, 2026 - 09:09 PM
29 వీక్షణలు

యువత భవితకు మత్తు ముప్పు వద్దు.. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా...

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

మదనపల్లి, ఆగస్టు 11: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మంగళవారం అధికారులతో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసి, విద్యార్థుల హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ల విక్రయాలను పూర్తిగా నిషేధించాలన్నారు. దీని అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని సూచించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 206 కేజీల గంజాయిని పట్టుకుని 26 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ కేసులతో పాటు, అవసరమైతే 'పీడీ యాక్ట్' ప్రయోగం చేయనున్నట్లు పేర్కొన్నారు.

'ఈగల్ క్లబ్స్' ద్వారా కళాశాలలు, పాఠశాలల్లో ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా, ప్రజలు వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి అధికారులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.