BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో వైసీపీ ప్రచార జోరు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 11:00 AM
11 వీక్షణలు

6వ వార్డులో నాలుగో రోజు గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణంలోని 28 వార్డుల్లో విజయం లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తిరువూరు పట్టణంలోని 6వ వార్డు అశోక్‌నగర్‌లో ఆదివారం నాలుగో రోజు ‘గడపగడపకు వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామిదాస్ ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజల నుంచి వివరాలను తెలుసుకున్నారు. కృష్ణా జలాల ద్వారా తిరువూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని స్వామిదాస్ తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అలాగే టిడ్కో గృహాల సమస్యపై లబ్ధిదారులకు అండగా ఉంటామని స్వామిదాస్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అధికారం చేపట్టిన అనంతరం టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే లబ్ధిదారుల తరఫున ప్రత్యక్ష పోరాటం చేస్తామని వెల్లడించారు.

తిరువూరు పట్టణంలోని 28 వార్డుల్లో పార్టీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు.