100 రోజులు – 100 గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని అమరావతి మండలం కర్లపూడిలో నిర్వహించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్NTODAY NEWS:కర్లపూడి
ఎనిమిదవ రోజు కర్లపూడి గ్రామ ప్రజలు తెలిపిన సమస్యలను స్వయంగా విని, వెంటనే పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే. రెండవ విడత రాజధాని భూసమీకరణలో భాగంగా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాలు కలపడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు మంచి సంతృప్తి వ్యక్తం చేశారన్న ఎమ్మెల్యే. రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Follow us on
WebsiteFacebookInstagramYouTube