BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 May, 2026 - 10:21 PM
171 వీక్షణలు

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే యెండల

​మంచిర్యాల : వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే పార్టీని బలోపేతం చేయవచ్చని, రాబోయే ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేయడానికే ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో పాటు ముఖ్య నాయకులు కన్నం యుగదీశ్వర్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు