BREAKING
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక 2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
21 May, 2026 - 10:21 PM
9 వీక్షణలు

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే యెండల

​మంచిర్యాల : వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే పార్టీని బలోపేతం చేయవచ్చని, రాబోయే ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేయడానికే ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో పాటు ముఖ్య నాయకులు కన్నం యుగదీశ్వర్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు