www.ntodaynews.com
తెలంగాణలో 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు..!
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న చేయుత పెన్షన్ పథకంలో అనర్హులను గుర్తించి తొలగించి, వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయంతో వేలాది మంది ఒంటరి మహిళలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. అర్హుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ, పెన్షన్ మంజూరు ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.