భూవివాదాల్లో జోక్యం వద్దు.. ప్రజలకు అందుబాటులో ఉండాలి: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా పనిచేయాలని, దర్పాన్ని ప్రదర్శించడం మానేసి విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ముఖ్యంగా భూవివాదాలు, సివిల్ స్వభావం గల వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.
శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్హెచ్వోలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రతి పోలీస్ స్టేషన్లో విజిటింగ్ అవర్స్ను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అలాగే అధికారులు క్యాంప్ కార్యాలయాలకే పరిమితం కాకుండా తమ కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.