అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులు పట్టివేత
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా: చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై రెండు డీసీఎంల లో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవుల ను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో గల గుంటపల్లి నుండి హైదరాబాదుకు గోవధకు తరలిస్తున్న డీసీఎంలు వస్తున్నాయని పక్కా సమాచారంతో చిట్యాల పోలీసులు జాతీయ రహదారి పై ఉన్న రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డులో తనిఖీలు నిర్వహించగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 26 ఆవులను గుర్తించామని తెలియజేశారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ఆవులను శంషాబాద్ లో గల గోవధ చేయటానికి తరలిస్తున్నారని గుర్తించామన్నారు. ఆవులను తరలిస్తున్న రెండు డీసీఎంలు సీజ్ చేసి , నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని , 26 ఆవుల రక్షణ కోసం గోశాలకు తరలించామని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు...
Follow us on
Website
Facebook
Instagram
YouTube