www.ntodaynews.com
అంబేద్కర్ విగ్రహానికి 34వ వార జ్ఞానమాల కార్యక్రమం
తెలంగాణ
కొండమడుగులో అంబేద్కర్ విగ్రహానికి 34వ వార జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి బాల్ద భాస్కర్
కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 34వ వార జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 5వ వార్డు సభ్యురాలు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచనా విధానం మరియు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ జ్ఞానమాల కార్యక్రమంలో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం, ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాడిగళ్ల బాబురావు, వార్డు సభ్యులు పెంటబోయిన భాను శ్రీ వేణు, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం అశోక్, కడెం సంపూర్ణ కిరణ్, మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ భూషపాక మల్లేష్, ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, మాజీ వార్డు సభ్యుడు దేశం శ్రీకాంత్, కడెం సాయి ప్రసాద్, బొడ్డు శివబాబు, మంద భూపాల్, చిన్నగల్ల లక్ష్మీనారాయణ, మోటే బాలకృష్ణ, మంద ఆనంద్, మంద శంకర్, బుడిది ప్రణయ్, బత్తుల నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
#DrBRAmbedkar #AmbedkarJayanti #GnanamalaProgram #MRPS #Konamadugu #SocialAwareness #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube