www.ntodaynews.com
శనీశ్వర స్వామి జయంతి సందర్భంగా విశేష పూజలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
శనీశ్వర స్వామి వారి జయంతిని పురస్కరించుకుని 16-05-2026 శనివారము 50 రాళ్ల మరవలో వెలసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా స్వామివారికి తైలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనున్నాయి. శనిదోష నివారణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరారు.
అలాగే మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు మనవి చేశారు.