జాతీయ రహదారిపై 8 అడుగుల కొండచిలువ.. కాసేపు నిలిచిన వాహనాలు
తెలంగాణ
/
వరంగల్
వర్ధన్నపేట: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్రోడ్డు సమీపంలో సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ రోడ్డును దాటుతూ కనిపించింది.
కొండచిలువను గమనించిన వాహనదారులు వాహనాలను నిలిపివేయడంతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండచిలువను ఆసక్తిగా తిలకించారు.
కొద్దిసేపటి తర్వాత కొండచిలువ రహదారిని దాటి వెళ్లడంతో వాహనాల రాకపోకలు తిరిగి కొనసాగాయి. భారీ కొండచిలువ రహదారిపై కనిపించడంతో స్థానికంగా కొంతసేపు ఆసక్తికర వాతావరణం నెలకొంది.