యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
యర్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కే. కమల్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
అదేవిధంగా వేణుగోపాల సొసైటీ, శాఖా గ్రంథాలయం, పార్డ్ ఇండియా సంస్థ ప్రధాన కార్యాలయం, 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, జడ్పీ హైస్కూల్, మెయిన్ ఎలిమెంటరీ, స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలు, సెయింట్ జోసెఫ్, ట్రూలైట్ పాఠశాలలు, విద్యుత్ సబ్స్టేషన్లు, ప్రభుత్వ హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్డ్ ఇండియా సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో యర్నగూడెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి.