BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
16 Aug, 2026 - 08:17 PM
22 వీక్షణలు

యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

యర్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కే. కమల్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

అదేవిధంగా వేణుగోపాల సొసైటీ, శాఖా గ్రంథాలయం, పార్డ్ ఇండియా సంస్థ ప్రధాన కార్యాలయం, 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, జడ్పీ హైస్కూల్, మెయిన్ ఎలిమెంటరీ, స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలు, సెయింట్ జోసెఫ్, ట్రూలైట్ పాఠశాలలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ప్రభుత్వ హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాకు వందనం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్డ్ ఇండియా సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో యర్నగూడెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి.