www.ntodaynews.com
స్నేహ బంధం బలోపేతమే మంత్రి నారా లోకేష్ విందు
తెలంగాణ
స్నేహ బంధం బలోపేతమే మంత్రి నారా లోకేష్ విందు: ఎంపీ బైరెడ్డి శబరి
NTODAY NEWS: అమరావతి
అమరావతి: ఉరుకు పరుగుల రాజకీయ జీవితంలో కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించే కార్యక్రమంగా మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు నిలిచిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా ఉమ్మడి ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం అమరావతిలో బుధవారం రాత్రి మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా కుటుంబాల మధ్య స్నేహం, సహకారం, సాన్నిహిత్యాన్ని పెంపొందించేలా ఈ విందు సమావేశం నిర్వహించబడిందన్నారు. నాయకత్వం అంటే కేవలం సభలు, సమావేశాలు మాత్రమే కాకుండా మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేయడమని పేర్కొన్నారు. అలాంటి ఆత్మీయతను చూపించిన మంత్రి నారా లోకేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
#NaraLokesh #ByreddySabari #TDP #Amaravati #PoliticalEvent #AndhraPradesh
Follow us on
Website
Facebook
Instagram
YouTube