www.ntodaynews.com
ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
తెలంగాణ
మంచిర్యాల నారాయణ స్కూల్లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్
మంచిర్యాలలోని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మేధో సామర్థ్యాలను ప్రదర్శించే వేదికగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’ (SLC) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ స్రవంతి ఆధ్వర్యంలో జరిగింది.
విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులు, ర్యాంకుల ద్వారానే కాకుండా, సబ్జెక్టుపై ఉన్న లోతైన అవగాహన, ఆత్మవిశ్వాసంతో వివరణ ఇచ్చే సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా చూపించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రిన్సిపాల్ తెలిపారు.
నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ప్రతినిధులు జి.ఎం గోపాల్ రెడ్డి, డి.జి.ఎం వెంకట రమణారెడ్డి, ఏ.జి.ఎం చైతన్య రావు మరియు ఆర్ & డి విభాగానికి చెందిన స్వాతి మార్గదర్శకాలతో కార్యక్రమాన్ని రూపొందించారు.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తాము నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు వివరించడం
ప్రయోగాత్మక ప్రదర్శనలు (Exhibits) ద్వారా పాఠ్యాంశాల అవగాహన
సమర్థవంతమైన ప్రజెంటేషన్ నైపుణ్యాల ప్రదర్శన
సెమిస్టర్-1, సెమిస్టర్-2గా ఏడాదికి రెండు సార్లు నిర్వహణ
తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశంతో విద్యార్థులు సృజనాత్మకతను చాటుకోవడం విశేషం.
కార్యక్రమ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.
#Mancherial #NarayanaSchools #StudentLedConference #EducationNews #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube