BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

తెలంగాణ
12 Jan, 2026 - 08:09 AM
335 వీక్షణలు

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

జగిత్యాలలో అలిశెట్టి జయంతి, వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి న్యూస్ రిపోర్టర్ తెలంగాణ అక్షర సూర్యుడు, జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అంగడి బజార్ కూడలిలో ఉన్న అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సామాన్యుడి కష్టాలను, సమాజంలోని అసమానతలను తన కలంతో ఎండగట్టిన ధీశాలి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. “మరణం నా చివరి చరణం కాదు” అని చాటిచెప్పిన ఆయన కవిత్వం నేటికీ అనేక మందికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. జగిత్యాల గడ్డపై పుట్టి తన అక్షరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాలకు గర్వకారణమని తెలిపారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు భోగ గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు ఎలామాద్రి కిషోర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, భారత్ ప్రశాంత్, కావేటి నవీన్, మధుకర్, భగవాన్, రాజ్, అనురాధ, కవితతో పాటు అలిశెట్టి ప్రభాకర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube