BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

తెలంగాణ
12 Jan, 2026 - 08:09 AM
240 వీక్షణలు

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

జగిత్యాలలో అలిశెట్టి జయంతి, వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి న్యూస్ రిపోర్టర్ తెలంగాణ అక్షర సూర్యుడు, జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అంగడి బజార్ కూడలిలో ఉన్న అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సామాన్యుడి కష్టాలను, సమాజంలోని అసమానతలను తన కలంతో ఎండగట్టిన ధీశాలి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. “మరణం నా చివరి చరణం కాదు” అని చాటిచెప్పిన ఆయన కవిత్వం నేటికీ అనేక మందికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. జగిత్యాల గడ్డపై పుట్టి తన అక్షరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాలకు గర్వకారణమని తెలిపారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు భోగ గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు ఎలామాద్రి కిషోర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, భారత్ ప్రశాంత్, కావేటి నవీన్, మధుకర్, భగవాన్, రాజ్, అనురాధ, కవితతో పాటు అలిశెట్టి ప్రభాకర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube