BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

​ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనకు గుర్తుగా ఘనంగా 'ఏక్ పేడ్ మా కే నామ్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:31 PM
50 వీక్షణలు

​హాజీపూర్ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు స్థాయిలో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంగా హాజీపూర్ మాజీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో రాపల్లి గుడి వద్ద ఘనంగా మొక్కలు నాటారు. ప్రధాని పిలుపునిచ్చిన 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును బ్రేక్ చేసి నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కొనియాడారు.

​దేశంలో భూతాపం పెరగడం, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, అడవులు అంతరిస్తున్న నేపథ్యంలో.. ప్రతి వ్యక్తి తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారిందని నాయకులు అన్నారు. ప్రకృతి సమతుల్యత కోసం ప్రజలందరూ తమ తల్లిదండ్రుల పేర్లపై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం రాజకీయాలే కాకుండా ప్రజా సంక్షేమం, దేశ అంతర్గత భద్రత, పర్యావరణం, సుపరిపాలన, స్వచ్ఛభారత్, విద్య, ఆరోగ్యం పట్ల స్పష్టమైన దృఢ సంకల్పంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ వర్షాకాలంలో ప్రతి కార్యకర్త ఎవరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా తమ ప్రాంతాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటాలని, దీనిని కేవలం మొక్కుబడిగా కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఒక ఉద్యమంలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా, సీనియర్ నాయకులు కాసెట్టి నాగేశ్వరరావు, తులా మధుసూదన్ రావు, బొలిశెట్టి తిరుపతి, హాజీపూర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, కమలాకర్ లగిశెట్టి, దాస్య నాయక్, గందే శ్రీనివాస్, మల్లేష్, శ్రీధర్, ఆలయ పూజారి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు