www.ntodaynews.com
ఏలూరు నగరంలో ధర్ గ్యాంగ్ కదలికలు గుర్తించిన పోలీసులు – ప్రజలకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాకు చెందిన ధర్ గ్యాంగ్ సభ్యులు ఏలూరులో కదలికలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ గ్యాంగ్కు చెందిన ముగ్గురు సభ్యుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ గ్యాంగ్ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 ఎమర్జెన్సీ నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.