ఈ నెల 18న ఉద్యమకారుల మహాధర్నాను జయప్రదం చేయండి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ప్రచార కార్యదర్శి చికిలం మెట్ల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని మండల అధ్యక్షులు ఏనుగు నర్సింహారెడ్డి అధ్యక్షతన ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చితులంమెట్ల అశోక్ మాట్లాడుతూ హామీల సాధనకై చేపట్టే ఈ ధర్నాకు ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
* తెలంగాణ ఉద్యమకారుల వేదిక గ్రామ కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామశాఖతో పాటు మండల నూతన బాధ్యులను ఎన్నుకున్నారు. టీయూవీ వెలిమినేడు గ్రామశాఖ
అధ్యక్షుడిగా పెద్ది రాఘవరెడ్డి ,
ప్రధాన కార్యదర్శిగా నాంతి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం మండల ఉపాధ్యక్షుడుగా చామల. వీరేశం
ప్రధాన కార్యదర్శిగా సామ. రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు