BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

ఈ నెల 18న ఉద్యమకారుల మహాధర్నాను జయప్రదం చేయండి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
16 Jun, 2026 - 03:14 PM
16 వీక్షణలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ప్రచార కార్యదర్శి చికిలం మెట్ల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని  మండల అధ్యక్షులు ఏనుగు నర్సింహారెడ్డి అధ్యక్షతన ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చితులంమెట్ల అశోక్ మాట్లాడుతూ హామీల సాధనకై చేపట్టే ఈ ధర్నాకు ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.

* తెలంగాణ ఉద్యమకారుల వేదిక గ్రామ కమిటీ ఎన్నిక

​ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామశాఖతో పాటు మండల నూతన బాధ్యులను ఎన్నుకున్నారు.​ టీయూవీ వెలిమినేడు గ్రామశాఖ
అధ్యక్షుడిగా పెద్ది  రాఘవరెడ్డి ,
​ప్రధాన కార్యదర్శిగా నాంతి  శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం మండల  ఉపాధ్యక్షుడుగా చామల. వీరేశం
​ప్రధాన కార్యదర్శిగా సామ. రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు