BREAKING
భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం
www.ntodaynews.com

అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:57 AM
54 వీక్షణలు

​కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

​మంచిర్యాల/శ్రీరాంపూర్:

రాష్ట్రంలో తాము ఒక కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం నాడు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో నిర్వహించిన 'బాయిబాట' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ గని సందర్శనలో భాగంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్మికుల సమస్యలు, సింగరేణి మనుగడపై విజ్ఞప్తి

కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత గట్టిగా కోరారు. అలాగే, సింగరేణి సంస్థకు భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ బొగ్గు బ్లాకులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని, సింగరేణికి ఎక్కువ బ్లాకులు దక్కేలా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

​అధికారుల తీరుపై ఆగ్రహం

​అనంతరం కార్మికుల పట్ల అధికారుల వ్యవహారశైలిపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో సింగరేణి ప్రాంతంలో 'అన్నలు' ఉండటంతో, కార్మికుల విషయంలో అధికారులు కొంత పద్ధతిగా వ్యవహరించే వారని ఆమె గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం అన్నలు లేరని అధికారులే నేరుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆమె అధికారుల తీరుపై మండిపడ్డారు.

అన్నలంతా మా పార్టీలోనే.. అధికారులకు స్పష్టమైన హెచ్చరిక

​మానవ హక్కులను కాలరాస్తున్న అధికారులకు కవిత ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. గతంలో ఉన్న ఆ 'అన్నలంతా' ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారని ఆమె సంచలన ప్రకటన చేశారు. కార్మికుల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తామంటే ఇకపై తాము ఏమాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆమె ఈ బాయిబాట కార్యక్రమం వేదికగా అధికారులకు తేల్చి చెప్పారు