BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఆగమ్మ ఇంటిని సందర్శించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Jun, 2026 - 07:52 AM
28 వీక్షణలు

ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆగమ్మ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అన్నారు.సోమవారం రోజున భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సింగన్న గూడెం గల డబుల్ బెడ్ రూమ్లు ,తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండా పురం,భువనగిరి మండలం అనంతారం గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తో కలసి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను,ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు.ఈ సందర్భంగా అయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల అమలు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.సింగన్నగూడెం లోని  డబల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలన్నారు.అనంతరం తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండా పురం, భువనగిరి మండలం అనంతారం గ్రామంలో మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరీ చేయడం జరిగిందని, వాటిలో ఎన్ని పూర్తయ్యాయని, ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని , ఇంకా ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం అందించిన సహాయంతో సొంత ఇంటి కల నేర వేరిందా అని  హోసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ లబ్ధిదారులతో ముచ్చటించారు గ్రామాలలో పూరిగుడిసే,డేరా,మట్టి గోడల,రేకుల షేడ్లలో నివసించే వారిని గుర్తించాలన్నారు. అట్టివారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరీ చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆగమ్మ ఇంటిని సందర్శించిన అధికారులు ఆమెతో మాట్లాడారు. “ఇప్పుడు మీ సొంత ఇల్లు నిర్మించుకున్నారు కదా, ఎలా అనిపిస్తోంది?” అని అడగగా, ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు. “చాలా సంతోషంగా ఉందని .ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు ఉండాలనే కల ఉండేదని .ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరింది. ఇప్పుడు భద్రంగా, గౌరవంగా మా సొంత ఇంట్లో నివసిస్తున్నాం. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని ఆమె తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అర్హులందరికీ గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అలివేలు,ఎంపీడీవోలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు