ప్రజావాణిలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు
జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మండల అధికారులు పరిష్కార దిశగా పనిచేయడం లేదా?
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి , వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.అందులో రెవిన్యూ శాఖ 49, ఉపాధి కల్పన 4, సర్వే ల్యాండ్ 4, హౌసింగ్ 4, జిల్లా పరిషత్ 4, విద్య శాఖ 2 , గ్రామీణ అభివృద్ధి 2,పంచాయతీ 2,సంక్షేమ శాఖ, సివిల్ సప్లై ,అటవీ,ఎస్సీ వెల్ఫేర్ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ , జడ్పీ సీఈవో శోభారాణి ,జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.