విద్యార్థులకు పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు
పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎం.పి.పి.ఎస్ పాఠశాలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు సోమవారం రోజున భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని భాగాయత్ ఎం.పి.పి.ఎస్ (MPPS) పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదుల పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థులకు పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.