BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం_రక్తదాన శిబిరం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:02 AM
58 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ రక్తదాన శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్, మరియు నరసింహులు,పాల్గొన్నారు. వీరితో పాటు మదనపల్లి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొని, రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్  మాట్లాడుతూ... రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్ మరియు నరసింహులు  మాట్లాడుతూ... పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా చూసేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను, దాతలను ఆసుపత్రి సిబ్బంది అభినందించి, వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మోహన్ రెడ్డి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ జ్యూస్, పండ్లు బిస్కెట్ ప్యాకెట్ ను ఆయన సొంత డబ్బుతో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.