BREAKING
భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం
www.ntodaynews.com

పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం_రక్తదాన శిబిరం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 11:02 AM
7 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ రక్తదాన శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్, మరియు నరసింహులు,పాల్గొన్నారు. వీరితో పాటు మదనపల్లి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొని, రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్  మాట్లాడుతూ... రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్ మరియు నరసింహులు  మాట్లాడుతూ... పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా చూసేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను, దాతలను ఆసుపత్రి సిబ్బంది అభినందించి, వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మోహన్ రెడ్డి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ జ్యూస్, పండ్లు బిస్కెట్ ప్యాకెట్ ను ఆయన సొంత డబ్బుతో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.