పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం_రక్తదాన శిబిరం ఏర్పాటు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తం లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రక్తదాన శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్, మరియు నరసింహులు,పాల్గొన్నారు. వీరితో పాటు మదనపల్లి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా పాల్గొని, రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్ మాట్లాడుతూ... రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
రక్తనిధి ఇంచార్జి దిలీప్ కుమార్ మరియు నరసింహులు మాట్లాడుతూ... పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా చూసేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను, దాతలను ఆసుపత్రి సిబ్బంది అభినందించి, వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మోహన్ రెడ్డి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ జ్యూస్, పండ్లు బిస్కెట్ ప్యాకెట్ ను ఆయన సొంత డబ్బుతో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.