పుంగనూరు రూరల్ మిథున్ దళం ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం
అన్నమయ్య జిల్లా పుంగనూరు విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు వారి భవిష్యత్ విజయాలను దృష్టిలో ఉంచుకొని, మిథున్ దళం ట్రస్ట్ వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి ఆధ్వర్యంలోపుంగనూరు రూరల్ ఏతూరు పంచాయతీ మరియు బండ్లపల్లి పంచాయతీ నెక్కొంది పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెంగారెడ్డి మాట్లాడుతూ
విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలస్తంభం. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అవసరమైన పుస్తకాలను అందజేసి, వారి విద్యా ప్రగతికి తోడ్పాటు అందించడం మా ట్రస్ట్ యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమంలో
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మిథున్ దళం ట్రస్ట్ తరపున వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి అన్న కృతజ్ఞతలు తెలియజేశారు