BREAKING
భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి
www.ntodaynews.com

​మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:19 PM
7 వీక్షణలు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలో మంగళవారం ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల దుస్థితిని చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.

​జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు బహిర్గతమయ్యాయి. బస్సుల్లో అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఫస్ట్‌ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్సులు లేకపోవడం, టైర్లు పూర్తిగా అరిగిపోయి (తేలిపోయి) ఉండటం గమనించిన డీటీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి ప్రమాదకర బస్సుల గురించి తల్లిదండ్రులు సైతం తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 5 స్కూల్ బస్సులను సీజ్ చేశామని డీటీవో తెలిపారు. విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు