BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:19 PM
118 వీక్షణలు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలో మంగళవారం ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల దుస్థితిని చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.

​జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు బహిర్గతమయ్యాయి. బస్సుల్లో అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఫస్ట్‌ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్సులు లేకపోవడం, టైర్లు పూర్తిగా అరిగిపోయి (తేలిపోయి) ఉండటం గమనించిన డీటీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి ప్రమాదకర బస్సుల గురించి తల్లిదండ్రులు సైతం తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 5 స్కూల్ బస్సులను సీజ్ చేశామని డీటీవో తెలిపారు. విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు