www.ntodaynews.com
నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి
తెలంగాణ
నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలి ---- చేన్నారం మల్లేష్ రాష్ట్ర కార్యదర్శి
NTODAY NEWS రిపోర్టర్ కూనూరు మధు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ క్షౌరవుతిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్షౌరవృతిదారులకు ప్రభుత్వం ఉచిత కరెంటు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని , ఎల్టి 2 కేటగిరీ నుండి ఎల్టి 4 కేటగిరిగా మార్చాలని కోరుతూ..ఈ నెల జూన్ 17న ఇందిర పార్క్ ముందు జరిగే ధర్నాలో క్షౌరవృత్తిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్ కోరారు. రామన్నపేట మండలంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ వృత్తిదారులకు (సెలూన్ షాపులకు ) 200 యూనిట్లు ఉచితంగా అందించిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు పెండింగ్లో బిల్లులు చెల్లించకుండా కరెంట్ అధికారులు వృత్తిదారులను వేధిస్తున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి బిల్లులు చెల్లించాలని కోరారు.. వృత్తిదారులకు ప్రభుత్వమే ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, 50 సంవత్సరాలు నిన్న క్షౌర వృత్తి దారులకు వృద్ధాప్య పింఛను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సంఘం నాయకులు బొడ్డు పల్లి వెంకటేశం ,వేముల సైదులు, టౌన్ అధ్యక్షులు రాపర్తి గణేష్ , జిల్లా నాయకులు పాల్వంచ ప్రతాప్, వేముల మల్లేష్, అశోక్ , నరేష్ , రవి , తదితరుల పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube