BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై తెలంగాణ సర్కార్ ఆరా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:45 AM
64 వీక్షణలు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఎన్ని ఖాతాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేరకు డిపాజిట్లు ఉన్నాయనే వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు పంపి పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.

ఇటీవల ఎస్బీఐకి సంబంధించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడం, ఆ చర్యపై బ్యాంకు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, ఇకపై ప్రభుత్వ శాఖలు ఎస్బీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా చూడాలని ముఖ్యమంత్రి మౌఖికంగా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో ఎస్బీఐలో కొత్తగా డిపాజిట్లు చేయాలంటే ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అన్ని శాఖలకు సమాచారం పంపినట్లు తెలిసింది.

దీంతో ప్రభుత్వ నిధుల నిర్వహణ, బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.