BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 12 January 2026, 07:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లారీ ఢీకొని యువకుడు మృతి

తెలంగాణ
12 Jan, 2026 - 07:49 AM
280 వీక్షణలు

కత్తిపూడి–పిఠాపురం రహదారిలో లారీ ఢీకొని యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల రిపోర్టర్ భోర శివారెడ్డి  జనవరి 11వ తేదీ రాత్రి సుమారు 10.50 గంటల సమయంలో కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న తుని పట్టణానికి చెందిన ముగ్గురు యువకులను చేబ్రోలు సమీపంలో, భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న NH-216 రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. బిక్కవోలు మండలం, ఆర్‌ఎస్‌పేట గ్రామానికి చెందిన లారీ (AP 16 TB 7029) శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నుంచి తవుడు లోడుతో అనపర్తి వైపు వెళ్తున్న సమయంలో, డ్రైవర్ అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ముందు వెళ్తున్న మోటార్ సైకిల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న పంతాడి దుర్గా ప్రసాద్ (వయసు 21) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మిగతా ఇద్దరు యువకులు ఆసనాల ప్రసాద్ (వయసు 28), ఆసనాల మహేష్ (వయసు 21) తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. సమాచారం అందుకున్న గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గా ప్రసాద్ మృతదేహంపై శవపంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. #KakinadaDistrict #RoadAccident #NH216 #FatalAccident #CrimeNews #AndhraPradeshNews #BreakingNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube