పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ వివిధ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానించు చున్నారు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆచార్య ఎన్ న్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. ఈ పాలిటెక్నిక్ అగ్నిగొండిపల్లి గ్రామం, చేడెపల్లి మండలం, పుంగనూరు వద్ద ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల వ్యవసాయ డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అవగాహన కల్పించబడుతుంది.
కళాశాలలో హాస్టల్ సదుపాయం, 24×7 వై-ఫై సౌకర్యం, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్ సదుపాయాలు, అర్హులైన అధ్యాపకులతో బోధన, అర్హత కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు/రీయింబర్స్మెంట్, 24 గంటల పరిశుభ్రమైన తాగునీటి సదుపాయం, కాలుష్య రహిత వాతావరణం మరియు సురక్షితమైన వసతి వాతావరణం కల్పించబడుతున్నాయి.
వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9381359956, 9010402068
వెబ్సైట్: www.angrau.ac.in
ఈమెయిల్: agp.punganur@angrau.ac.in