BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 08:05 PM
17 వీక్షణలు

ఘనంగా ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సమాజంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సతీసహగమనం నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధి, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను “ఆధునిక భారతదేశ పితామహుడు”గా గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు దేవర అంజలి, మీనుగు మాధవి తదితరులు పాల్గొన్నారు.