ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన పెట్రోల్ డీజల్ రేట్ల పై వైస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం..
పెరిగిన పెట్రోల్, డిసల్ ధర లు వెంటనే తగ్గించాలి... పుంగనూరు వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు..
అన్నమయ్య జిల్లా పుంగనూరు లో వైఎస్సార్ సిపి పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం...
మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు లో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కి మెమొరాండం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు పెట్రోల్,డిసల్ ధరలు పెంచి ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నారని, పెరిగిన పెట్రోల్, డిసల్ ధరలతో నిత్యవసర వస్తువులు సైతం పెరిగిపోయాయని ఇలాగే కొనసాగితే ప్రజలు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డిసల్ ధరలు తగ్గించాలని డిమేండ్ చేశారు.ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ చైర్మన్ లు, యంపిపి,లు, జడ్పిటీసీలు,వైస్సార్ సిపి పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజా ప్రతినిధులు,వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ సభ్యులు కో ఆప్షన్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, పంచాయతీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు,వివిధ మండల విభాగ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు, పాల్గొన్నారు.