ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం
ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లేని వారికి కూడా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే విధంగా చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించింది.
బయట మార్కెట్లో కిలో రూ.65 వరకు ఉన్న బీపీటీ ముడి బియ్యాన్ని కేవలం రూ.50కే, బీపీటీ స్టీమ్డ్ బియ్యాన్ని రూ.52కే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సదుపాయం పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండి, ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా రైతు బజార్లు, ఎంపిక చేసిన రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి.
అదేవిధంగా రేషన్ దుకాణాలను మరింత విస్తరించి, 250కి పైగా నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేలా 1000కు పైగా మినీ మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయంతో రేషన్ కార్డు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.